కారులో ఊపిరి ఆడక ఇద్దరు పిల్లల మృతి

ABN , First Publish Date - 2020-06-16T19:52:27+05:30 IST

కారులో పిల్లలు ఆడుకుంటుండగా డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ఇద్దరు పిల్లలు మరణించిన విషాద ఘటన...

కారులో ఊపిరి ఆడక ఇద్దరు పిల్లల మృతి

మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్): కారులో పిల్లలు ఆడుకుంటుండగా డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ఇద్దరు పిల్లలు మరణించిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలోని ముందాపాండే ప్రాంతంలో వెలుగుచూసింది. నలుగురు పిల్లలు ఆడుకుంటూ కారెక్కారు. కారు డోర్ ఆటోమేటిక్ గా లాక్ అయింది. దీంతో గాలిఆడక ఇద్దరు పిల్లలు మరణించారు. మరో ఇద్దరు పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. 

Updated Date - 2020-06-16T19:52:27+05:30 IST