చెరువులో దిగి ఇద్దరు పిల్లలు మృతి
ABN , First Publish Date - 2021-09-02T01:52:16+05:30 IST
జిల్లాలో చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృత్యువాత
శ్రీకాకుళం: జిల్లాలో చెరువులో పడి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. లావేరు మండలంలోని బయ్యన్నపేట యాతపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాతపేట గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు స్థానిక చెరువులోకి దిగారు. అయితే ఇద్దరు పిల్లలు చెరువులోని నీటిలో మునిగి మృతి చెందారు. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.