AP News: కర్నూలులో రెండు చిరుతల సంచారం

ABN , First Publish Date - 2022-07-30T14:56:48+05:30 IST

జిల్లాలోని తుగ్గలి మండలంలో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది.

AP News: కర్నూలులో రెండు చిరుతల సంచారం

కర్నూలు: జిల్లాలోని తుగ్గలి మండలంలో రెండు చిరుత పులుల(Cheetahs) సంచారం కలకలం రేపుతోంది. రామకొండకు చెందిన పల్లె సుంకన్న పొలంలో రెండు చిరుతలను చూసిన స్థానికులు ఫారెస్టు అధికారుల(Forest officers)కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పల్లె సుంకన్న పొలంలో చిరుతల పాదముద్రలు గుర్తించి రెండు చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. చిరుతల సంచారంతో రాంపల్లి, రామ్ కొండ, ఇంద్రంపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  ఒంటరిగా పొలాలకు వెల్లొద్దని గ్రామస్థులకు ఫారెస్టు అధికారులు అవగాహన కల్పించారు. 

Updated Date - 2022-07-30T14:56:48+05:30 IST