ఇద్దరు దొంగల అరెస్ట్.. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-09-27T23:03:12+05:30 IST
ఇద్దరు దొంగల అరెస్ట్.. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
బెంగళూరు: వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో రెండు చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 13.5 లక్షల విలువైన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
42 ఏళ్ల వయసున్న ఇద్దరు దొంగలను బెంగళూరులోని బైదరహల్లి పోలీసులు పట్టుకున్నారు. దొంగల నుంచి రూ. 13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ లాక్ చేసిన ఇళ్లను దోచుకునేవారని, దొంగిలించబడిన ఆభరణాలను బ్రోకర్లకు అమ్ముతారని పోలీసులు చెప్పారు. వారి అరెస్టుతో బెంగళూరులో నమోదైన ఐదు దోపిడీ కేసులను పోలీసులు పరిష్కరించారు.