రెండు బైక్‌లు ఢీ

ABN , First Publish Date - 2020-12-02T04:23:45+05:30 IST

రెండు బైక్‌లు ఢీ

రెండు బైక్‌లు ఢీ
గాయాలైన వారికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు చేస్తున్న వైద్యులు

  • ఐదుగురికి గాయాలు

దోమ: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని  ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. దోమ మండల పరిధి మోత్కూర్‌ గేట్‌ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. కులకచర్ల నుంచి ఉపేందర్‌రెడ్డి, మల్లేఽశ్‌, చెన్నయ్యలు స్వగ్రామమైన మోత్కూర్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మోత్కూర్‌ నుంచి సాయిరాజు, భానులు ద్విచక్ర వాహనంపై కులకచర్లకు వెళ్తున్నారు. మోత్కూర్‌గేట్‌ సమీపంలోకి రాగానే అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న రెండు  బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న  ఐదుగురికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు  సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-02T04:23:45+05:30 IST