రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2021-04-16T05:27:10+05:30 IST
రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది వద్ద చోటు చేసుకుంది.
నారాయణరావుపేట, ఏప్రిల్ 15: రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, జిల్లాల గ్రామాలకు చెందిన భూమయ్య, మహేష్, భానుప్రసాద్, రాజు, నవీన్ రెండు బైకులపై సిద్దిపేట వైపు వెళ్తున్నారు. గుర్రాలగొంది గ్రామానికి చేరుకునే సమయంలో బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.