జానకంపల్లిలో రెండు బైక్లు దగ్ధం
ABN , First Publish Date - 2021-01-27T05:40:13+05:30 IST
మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన గూడాల మల్లేశం బైక్తో పాటు అతడి అల్లుడి బైక్ను సోమవారం రాత్రి ఇంటి ఎదుట ఉంచారు.
మెదక్ రూరల్, జనవరి 26 : మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన గూడాల మల్లేశం బైక్తో పాటు అతడి అల్లుడి బైక్ను సోమవారం రాత్రి ఇంటి ఎదుట ఉంచారు. ఉదయం నిద్రలేచే వరకు ఇంటి ముందున్న రెండు బైకులు కాలిపోయి ఉన్నాయి. అందులో ఓ బైక్ పూర్తిగా కాలిపోగా, మరో బైక్ పాక్షికంగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్ రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.