రెండు ఆటోలు ఢీ..

ABN , First Publish Date - 2021-04-17T04:44:51+05:30 IST

రచ్చుమర్రి గ్రామ సమీపంలోని బసలదొడ్డి చెరువు వద్ద శుక్రవారం ఆటోలు ఢీకొని, ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామి(37) మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

రెండు ఆటోలు ఢీ..

  1. ఒకరి మృతి.. నలుగురికి గాయాలు


మంత్రాలయం, ఏప్రిల్‌ 16: రచ్చుమర్రి గ్రామ సమీపంలోని బసలదొడ్డి చెరువు వద్ద శుక్రవారం ఆటోలు ఢీకొని, ఎమ్మిగనూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామి(37) మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ బాబు తెలిపిన మేరకు.. కోసిగి నుంచి ఎమ్మిగనూరు వెళ్లుతున్న టాటా ఏస్‌ ఆటో, మాధవరం నుంచి కోసిగికి వెళ్లుతున్న మరో ఆటో ఢీకొన్నాయి. ఆటో డ్రైవర్‌ మఠం ఈశ్వరయ్యస్వామికి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఉసేని, హనుమంతు, నరసమ్మ, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు మఠం ఈశ్వరయ్యస్వామికి భార్య ఉమ మహేశ్వరి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతాదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ బాబు తెలిపారు. 


Updated Date - 2021-04-17T04:44:51+05:30 IST