చైనా మాంజ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-13T02:15:53+05:30 IST

జిల్లాలోని మీర్‌పేట్ పీఎస్ పరిధిలో నిషేధిత చైనా మాంజను

చైనా మాంజ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్ పీఎస్ పరిధిలో నిషేధిత చైనా మాంజను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి180 చైనీస్ మాంజ కవర్ ప్యాకెట్లు, 30 బండిల్స్, 500 మినీ బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 336,188, R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను ఎగుర వేయడానికి చైనీస్ మాంజను వాడరాదన్నారు. చైనీస్ మాంజను వాడడం వలన పక్షులకు దారాలు తగిలి మరణిస్తాయన్నారు. అంతేకాకుండా చైనీస్ మాంజ తయారీలో ప్రమాదకర రసాయనాలను వాడుతారన్నారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమన్నారు. 


Updated Date - 2022-01-13T02:15:53+05:30 IST