రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-29T05:52:14+05:30 IST
రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని చీరాల జీఆర్పీ పోలీసు లు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
చీరాలటౌన్, నవంబరు 28: రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని చీరాల జీఆర్పీ పోలీసు లు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మురళీకృష తెలిపిన వి వరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన కుమార్ దలై, అనీల్కు మార్ జేనా ఆదివారం బిలాస్ పూర్ - తిరుపతి రైలులో అక్ర మంగా గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్సై సీహెచ్.కొండయ్య రైలులో చీరాల వచ్చినప్పుడు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. గంజాయితో పట్టుబడిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్టు చెప్పారు. వీరి నుంచి రూ.15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీనివిలువ రూ.లక్షన్నర ఉంటుందని తెలిపా రు. కేసులో చాకచక్యంగా వ్యహరించిన ఎస్సై, సిబ్బంది శ్రీనివాసరావు, కరిముల్లా, నరేష్, కె.శ్రీనివాసరావు, బాదర్లను డీఎస్పీ అభినందించారు.