మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-05-30T10:38:45+05:30 IST

తోలాపి సమీపంలో ఎక్సైజ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు దాడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్టుచేసి

మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

పొందూరు: తోలాపి సమీపంలో ఎక్సైజ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు దాడిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్టుచేసి కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి పి.సూర్యనారాయణ, పి.జోగినాయుడుల నుంచి 9 మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ సీఐ గణపతిబాబు, ఎస్‌ఐ హేమమందిర, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-05-30T10:38:45+05:30 IST