నిషేధిత గుట్కా తరలిస్తున్న ఇరువురు అరెస్టు

ABN , First Publish Date - 2021-05-18T05:19:53+05:30 IST

మండలంలోని ఎన్‌.పాలగిరి క్రాస్‌ వద్ద నిషేఽధిత గుట్కాను తరలిస్తున్న ఇరువురిని అరెస్టు చేసి రూ.4,92,750 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు.

నిషేధిత గుట్కా తరలిస్తున్న ఇరువురు అరెస్టు
గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి

వీరపునాయునిపల్లె, మే 17: మండలంలోని ఎన్‌.పాలగిరి క్రాస్‌ వద్ద నిషేఽధిత గుట్కాను తరలిస్తున్న ఇరువురిని అరెస్టు చేసి రూ.4,92,750 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. లింగారెడ్డి మధుసూధన్‌రెడ్డి, కాల్వ శివమహేశ్వర అనే ఇరువురు 11 పెద్ద ప్లాస్టిక్‌ సంచులలో బ్లూబుల్‌ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


 

Updated Date - 2021-05-18T05:19:53+05:30 IST