ఇద్దరు నిందితులకు రిమాండ్‌

ABN , First Publish Date - 2022-08-11T06:03:33+05:30 IST

ఇంటి భూమి వివాదంలో తలెత్తిన మనస్పర్థలతో 2016సంవత్సరంలో ఓ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను బుధవారం మెజిస్ర్టేట్‌లో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు నిందితులకు రిమాండ్‌


బొమ్మలరామారం, ఆగస్టు10: ఇంటి భూమి వివాదంలో తలెత్తిన మనస్పర్థలతో 2016సంవత్సరంలో ఓ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను బుధవారం మెజిస్ర్టేట్‌లో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లు, భూమి విషయంలో పల్లె జ్ఞానేశ్వర్‌, పల్లె వెంకటయ్య కలిసి మరి కొంతమందితో 2016 మార్చి 16న ఉదయం 6గంటల సమయంలో కర్రలతో, రాళ్లతో తన కుటుంబంపై దాడి చేసినట్లు మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పల్లె శంకరయ్య అప్పటి సబ్‌ ఇనస్పెక్టర్‌ నర్సింహారావుకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఏపీపీ సౌజన్య, ఏజేఎ్‌ఫసీఎం ఆధ్వర్యంలో నిందితులను దోషులుగా నిర్దారించి ఇరువురికి రూ.6వేలు జరిమానా విధిస్తూ, ఇద్దరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జ్ఞానేశ్వర్‌, వెంకటయ్యలను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. 


Updated Date - 2022-08-11T06:03:33+05:30 IST