Coronaపై పోరులో భారత్‌కు ట్విటర్ భారీ సాయం!

ABN , First Publish Date - 2021-05-11T17:57:39+05:30 IST

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Coronaపై పోరులో భారత్‌కు ట్విటర్ భారీ సాయం!

వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం కరోనాతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తాజాగా భారత్​కు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది.​ మూడు స్వచ్ఛంద సంస్థలకు కలిపి 15 మిలియన్ల డాలర్ల(భారత కరెన్సీలో దాదాపు రూ. 110కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నిధులను తాత్కాలిక కరోనా కేంద్రాల ఏర్పాటు, మెడిసిన్స్ కొనుగోలు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సరఫరా కోసం వినియోగించాలని కోరింది. ఈ విరాళాన్ని దేశంలో కొవిడ్‌ సేవలు అందిస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా అందివ్వనున్నట్లు ట్విటర్ సీఈఓ జాక్‌ ప్యాట్రిక్ డోర్సె సోమవారం తెలిపారు. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్​ఏ, వైల్‌ కేర్‌ సంస్థల ద్వారా ఈ నిధులు ఖర్చు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో వైల్‌ కేర్‌ సంస్థకు 10 మిలియన్లు కేటాయించగా.. ఎయిడ్‌ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్​ఏలకు చెరో 2.5 మిలియన్లు ఇస్తున్నట్లు చెప్పారు.



Updated Date - 2021-05-11T17:57:39+05:30 IST