truck collides with container: 24 మంది కన్వారియాలకు గాయాలు
ABN , First Publish Date - 2022-07-26T16:43:46+05:30 IST
కన్వారియాల(Kanwariyas) యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది....
జైపూర్ (రాజస్థాన్): కన్వారియాల(Kanwariyas) యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాజస్థాన్లోని(Rajasthan) దౌసా జిల్లాలో జాతీయ రహదారి 21పై కన్వారియాలు ప్రయాణిస్తున్న కంటైనర్ను ట్రక్కు ఢీకొనడంతో 24 మంది గాయపడ్డారు(injured).నదీ నీటిని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసేందుకు శివభక్తులు(కన్వారియాలు) వెళుతుండగా ఈ ప్రమాదం(accident) జరిగింది. పుష్కర్ నుంచి దౌసాలోని ఘాజీపూర్కు కన్వారియాలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.దౌసాలోని మెహందీపూర్ బాలాజీ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన వెంటనే మాన్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన డీఎస్పీ సంత్రం, పోలీసు సిబ్బందితో సహా సీనియర్ పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను దౌసాలోని సిక్రాయ్, మన్పూర్ ఆస్పత్రులకు తరలించారు.గాయపడిన వారి పరిస్థితిని గమనించి కన్వారియాలను దౌసా నగర ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తీవ్రంగా గాయపడిన కన్వరియాల్లో ముగ్గురిని జైపూర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 మంది ప్రస్తుతం దౌసా ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన కన్వారియాలు ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.