Gurugram జాతరలో కల్తీ ప్రసాదం తిని 28మందికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-04-13T13:34:15+05:30 IST

గురుగ్రామ్ జాతరలో కల్తీ ప్రసాదం తిని 28 మంది అస్వస్థతకు గురయ్యారు...

Gurugram జాతరలో కల్తీ ప్రసాదం తిని 28మందికి అస్వస్థత

దర్యాప్తునకు ఆదేశం

గురుగ్రామ్: గురుగ్రామ్ జాతరలో కల్తీ ప్రసాదం తిని 28 మంది అస్వస్థతకు గురయ్యారు.కల్తీ ప్రసాదం తిన్న పలువురు చిన్నారులతో సహా 28 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఫరూఖ్‌నగర్‌ సమీపంలోని ముబారిక్‌పూర్‌లో జరుగుతున్న జాతరలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.జాతరలో ప్రజలకు మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్ అందించారు.జ్యూస్ తాగిన తర్వాత 10 మంది చిన్నారులు సహా దాదాపు 28 మంది అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వారికి ప్రథమ చికిత్స అందించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-04-13T13:34:15+05:30 IST