Rajasthan: బస్సును ఢీకొన్న ట్యాంకర్...12 మంది మృతి

ABN , First Publish Date - 2021-11-10T17:51:22+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు....

Rajasthan: బస్సును ఢీకొన్న ట్యాంకర్...12 మంది మృతి

జోద్‌పూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. బార్మేర్-జోద్‌పూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ప్రయాణికుల ప్రైవేటు బస్సును ఢీట్టింది.దీంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రేగిన మంటల్లో 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.ప్రమాదం జరిగినపుడు బస్సులో 25మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన బస్సులో నుంచి 10 మంది మృతదేహాలను వెలికితీశారు.పోలీసులు, జిల్లా అధికారులు సంఘటన స్థలానికి తరలివచ్చారు. ఈ ప్రమాదం అనంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. 


Updated Date - 2021-11-10T17:51:22+05:30 IST