కరోనా... 24 గంటల్లో 12 మంది మృత్యువాత

ABN , First Publish Date - 2020-08-05T02:00:32+05:30 IST

కరోనా మహమ్మరి బారిన పడి గుంటూరు జిల్లాలో కేవలం 24 గంటల్లోనే పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉధృతికి ఈ పరిస్థితి నిదర్శనం. గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తంమీద 67 మంది ప్రాణాలొదిలారు. కాగా... రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,604 కు చేరుకుంది.

కరోనా... 24 గంటల్లో 12 మంది మృత్యువాత

గుంటూరు : కరోనా మహమ్మరి బారిన పడి గుంటూరు జిల్లాలో కేవలం 24 గంటల్లోనే పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా ఉధృతికి ఈ పరిస్థితి నిదర్శనం. గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తంమీద 67 మంది ప్రాణాలొదిలారు. కాగా... రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,604 కు చేరుకుంది.


ఇక... కొత్తగా 9,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో... ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333 కు చేరుకుంది. ఇక... తాజాగా 6,953 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇంకా 79,104 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 95,625 మంది కరోనా నుంచి కోలుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2020-08-05T02:00:32+05:30 IST