బీరంగూడ రోడ్డుకు మరమ్మతులు చేయాలని కేటీఆర్కు ట్వీట్
ABN , First Publish Date - 2020-08-11T11:22:58+05:30 IST
గుంతలమయంగా మారిన బీరంగూడా-కిష్టారెడ్డిపేట రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలని కొందరు స్థానికులు సోమవారం ట్విటర్ ద్వారా
స్పందించిన మంత్రి
పటాన్చెరు, ఆగస్టు 10: గుంతలమయంగా మారిన బీరంగూడా-కిష్టారెడ్డిపేట రోడ్డుకు తక్షణం మరమ్మతులు చేయాలని కొందరు స్థానికులు సోమవారం ట్విటర్ ద్వారా మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు జలమయంగా మారి పడుతున్న ఇబ్బందుల ఫొటోలను ట్విటర్ ద్వారా మంత్రికి పంపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ట్విటర్ ద్వారా తెలియజేసిన పెద్ద సమస్యపై మంత్రి స్పందించి సమాధానం చెప్పడంతో ఆయా కాలనీల వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.