అనుమానాస్పద స్థితిలో బుల్లితెర నటి మృతి

ABN , First Publish Date - 2020-04-10T07:12:59+05:30 IST

విశాఖ జిల్లా సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన విశ్వశాంతి (23) హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి ఉంటూ టీవీ సీరియళ్లలో...

అనుమానాస్పద స్థితిలో బుల్లితెర నటి మృతి

అమీర్‌పేట, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా సింహాచలం సమీపంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన విశ్వశాంతి (23)  హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. కొంతకాలం క్రితం తల్లి విశాఖకు వెళ్లిపోవడంతో.. ఆమె ఒంటరిగా ఉంటున్నారు. మూడు రోజులుగా విశ్వశాంతి ఫ్లాట్‌ నుంచి బయటకు రాకపోవడంతో.. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అనుమానంతో తలుపు తట్టాడు. స్పందన లేకపోవడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా, విశ్వశాంతి విగతజీవిగా పడి ఉన్నారు. ఆమె తలకు బలమైన గాయాలై, తీవ్ర రక్తస్రావమైన గుర్తులు ఉన్నాయి. 

Updated Date - 2020-04-10T07:12:59+05:30 IST