టీఆర్ఎస్ అభ్యర్థులకు టీయూటీఎఫ్ మద్దతు
ABN , First Publish Date - 2021-03-08T07:58:12+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) మద్దతు ప్రకటించింది.
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవీలకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు టీయూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కైలాసం, నూతనకంటి బాబు ఒక ప్రకటనలో తెలిపారు.