రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు : జేసీ

ABN , First Publish Date - 2021-10-20T06:36:19+05:30 IST

రాష్ట్రాన్ని వైసీపీ నేతలు రావణకాష్టం లా మారుస్తున్నారని టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు : జేసీ

తాడిపత్రి, అక్టోబరు 19: రాష్ట్రాన్ని వైసీపీ నేతలు రావణకాష్టం లా  మారుస్తున్నారని టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో ప్రతిపక్షాల పై దాడులు చేసేవారని, నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయాలపైనే దా డులు చేసే స్థాయికి వైసీపీ చేరిందని విమర్శించారు. రాష్ట్రంలో రో జురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశా రు. గతేడాది తన ఇంటిపై దాడికి ప్రయత్నించారని, టీడీపీ అధినే త నారా చంద్రబాబునాయుడు ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డార ని విమర్శించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమ కేసులు పె ట్టడం జరుగుతోందన్నారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడానికి వై సీపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T06:36:19+05:30 IST