కరోనాతో చనిపోయిన వ్యక్తితో తిరిగిన మహబూబాబాద్‌ వాసులు

ABN , First Publish Date - 2020-03-29T13:35:56+05:30 IST

హైదరాబాద్‌లో కరోనాతో చనిపోయిన...74 ఏళ్ల వృద్ధుడితో కలిసి తిరిగిన

కరోనాతో చనిపోయిన వ్యక్తితో తిరిగిన మహబూబాబాద్‌ వాసులు

మహబూబాబాద్:  హైదరాబాద్‌లో కరోనాతో చనిపోయిన...74 ఏళ్ల వృద్ధుడితో కలిసి తిరిగిన మహబూబాబాద్‌ వాసులు నలుగురిని అధికారులు గుర్తించారు. వారిని ఐసోలేషన్‌కు తరలించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది.  హైదరాబాద్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన విషయం తెలిసిందే.  ఖైరతాబాద్‌లో 74 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని, చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి చెప్పారు. గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడని చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించామన్నారు. 

Updated Date - 2020-03-29T13:35:56+05:30 IST