పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు..

ABN , First Publish Date - 2020-09-19T10:17:34+05:30 IST

రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు చలో అమలాపురం తరలివెళ్లిన ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌తోపాటు మరో 13 మందిని అమలాపురం

పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు..

కోటనందూరు, సెప్టెంబరు 18: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు చలో అమలాపురం తరలివెళ్లిన ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌తోపాటు మరో 13 మందిని అమలాపురం గడియార స్తంభం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ప్రధాన కార్యదర్శి వేటూకూరి సూర్యనారాయ ణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, పాలూరి శ్రీనివాస్‌, దేవారపు సూర్యనారాయణమూర్తి, గువ్యల నాగరాజు, గనిశెట్టి వెంకటేశ్వర్లు, కటిక గంగాదర్‌, ఎస్‌దుర్గాప్రసాద్‌, వేగి వెంకటేశ్వరరావు, గణేష్‌, తాతాజీ ఉన్నారు. అమలాపురంలో అరెస్టు చేసిన వీరిని అంబాజీపేట, ముమ్మడివరం, తాళ్లరేవు, సామర్లకోట, కాకినాడ, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని రూరల్‌ పోలీసు స్టేషన్లలో తిప్పుతూ చివరగా కోటనందూరు పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి సీఐ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో బెయిల్‌పై విడుదల చేశారు. 

Updated Date - 2020-09-19T10:17:34+05:30 IST