8 నుంచి పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-06-06T12:56:57+05:30 IST
8 నుంచి పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం
నెల్లూరు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి పసుపు కోనుగోలు కేంద్రాన్ని 8 నుంచి పునఃప్రారంభిస్తామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ సుజాత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రజోతిలో పసుపు అమ్మేదెలా అన్న శీర్షిక ప్రచురితం కావడంతో ఆమె స్పందించారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ కర్షక్లో నమోదైన 171 మందితో పాటు, వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన 152 మంది రైతుల వివరాలను జేసీకి, మార్క్ఫెడ్ ఎండీకి నివేదిక పంపుతామన్నారు. ఆమె వెంట ఏడీఏ సత్యనారాయణచౌదరి, ఏవో చెన్నారెడ్డి ఉన్నారు.