విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
ABN , First Publish Date - 2021-09-29T05:14:15+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ విముక్తి సంచార, సెమీ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు తురక నరసింహ పేర్కొన్నారు.
తురక నరసింహ
గుంటూరు(విద్య), సెప్టెంబరు 28: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ విముక్తి సంచార, సెమీ సంచార జాతుల అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు తురక నరసింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అర్ధం అయ్యే విధానంలో బోధన అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచవో డాక్టర్ జె.యాస్మిన, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కల్పనాబేబి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, బీసీ కార్పొరేషన ఈడీ గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.