యనమలను కలిసిన తెలుగు యువత నాయకులు

ABN , First Publish Date - 2021-07-30T06:35:59+05:30 IST

నూతనంగా ఎన్నికైన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు మాజీమంత్రి యనమల రామకృష్ణుడిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

యనమలను కలిసిన తెలుగు యువత నాయకులు
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కృతజ్ఙతలు తెలుపుతు తెలుగుయువత నాయకులు

తుని,  జూలై 29: నూతనంగా ఎన్నికైన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు మాజీమంత్రి యనమల రామకృష్ణుడిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారంతా పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు. యువతను ఆకట్టుకుని, వారికి పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించాలన్నారు. అనంతరం ఆయన్ను యనమల శివరామకృష్ణన్‌, వెంకటేష్‌, సతీష్‌రాజు, కందుల బాబురాయుడు, కిశోర్‌ సత్కరించారు.

Updated Date - 2021-07-30T06:35:59+05:30 IST