యనమలను కలిసిన తెలుగు యువత నాయకులు
ABN , First Publish Date - 2021-07-30T06:35:59+05:30 IST
నూతనంగా ఎన్నికైన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు మాజీమంత్రి యనమల రామకృష్ణుడిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తుని, జూలై 29: నూతనంగా ఎన్నికైన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు మాజీమంత్రి యనమల రామకృష్ణుడిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారంతా పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు. యువతను ఆకట్టుకుని, వారికి పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించాలన్నారు. అనంతరం ఆయన్ను యనమల శివరామకృష్ణన్, వెంకటేష్, సతీష్రాజు, కందుల బాబురాయుడు, కిశోర్ సత్కరించారు.