మహానాడుకు అధికసంఖ్యలో తరలిరావాలి

ABN , First Publish Date - 2022-05-24T06:52:40+05:30 IST

తుని, మే 23: ఒంగోలులో ఈనెల 28న జరిగే మహానాడుకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని టీడీ పీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో గల గ్రా మాల నాయకులతో సోమవారం మినీ

మహానాడుకు అధికసంఖ్యలో తరలిరావాలి

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు

తుని, మే 23: ఒంగోలులో ఈనెల 28న జరిగే మహానాడుకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలని టీడీ పీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో గల గ్రా మాల నాయకులతో సోమవారం మినీ మహానాడు నిర్వహించారు. కృష్ణుడు మాట్లాడుతూ 28న బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలన్నారు. వైసీపీ చేస్తున్న అరచకాలు, దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయడంలో కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, కాకినాడ జిల్లా టీడీపీ ఉపాఽధ్యక్షుడు సుర్ల లోవరాజు, తుని పట్టణ, మండల కోటనందూరు, తొండంగి మండలాధ్యక్షులు యినుగంటి సత్యనారాయణ, అప్పన రమేష్‌, గాడి రాజుబాబు, కోడ రమణ, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:52:40+05:30 IST