Tungabhadra జలాల విడుదలపై 21న ఐసీసీ సమావేశం
ABN , First Publish Date - 2022-06-18T17:45:59+05:30 IST
తుంగభద్ర జలాశయం నుంచి ఆయకట్టు భూములకు నీటి విడుదలపై ఈ నెల 21న 117వ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం
బళ్లారి(బెంగళూరు), జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం నుంచి ఆయకట్టు భూములకు నీటి విడుదలపై ఈ నెల 21న 117వ నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం నిర్వహిస్తున్నట్లు టీబీ అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. మునిరాబాద్లోని కా డా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. డ్యాంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, అలాగే ముందు కురిసే వర్షాలకు లభ్యమైయే జలాలు, వీటిలో కర్ణాటక, ఆంధ్ర, రాష్ట్రలకు నీటి వాటా కేటాయింపులు, ఖరీఫ్ కాలువలకు నీరు విడుదల తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిపారు.