AP news: తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద
ABN , First Publish Date - 2022-07-28T15:58:56+05:30 IST
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కర్నూలు: తుంగభద్ర జలాశయాని(Tungabhadra resevoir)కి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 1632.81 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 44824 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40245 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105 టీఎంసీలు కాగా... ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 105.025 టీఎంసీలుగా కొనసాగుతోంది.