తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద నీరు

ABN , First Publish Date - 2021-07-25T18:21:31+05:30 IST

ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవాడైన తుంగభద్రా జలాశయానికి శనివారం లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఇలాగే కొనసాగితే 3-4 రోజుల్లో జలాశయం భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. జలాశయ పదీవా

తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద నీరు

బళ్లారి(కర్ణాటక): ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవాడైన తుంగభద్రా జలాశయానికి శనివారం లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఇలాగే కొనసాగితే 3-4 రోజుల్లో జలాశయం భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. జలాశయ పదీవాహక ప్రాంతాలైన మలేనాడులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురువడంతో తుంగభద్రా నదుల ఇన్‌ఫ్లో పెరిగింది. తుంగా జలాశయం నుండి 78వేల క్యూసెక్‌ల నీటిని నదులకు వదిలారు.జలాశయ పరివాహక ప్రాంతాలలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ఇన్‌ప్లో  పెరిగింది. తుంగభద్రా జలాశయ నీటి సామర్ధ్యం 100.885టిఎంసీలు, ప్రస్తుతం శనివారానికి 71.721 టీఎంసీల నీరు సంగ్రహణ మైంది. కాలువలకు 5214 క్యూసెక్‌లు నీరు విడుదల చేస్తున్నారు. జలాశయపు గరిష్ట స్థాయి 16331 అడుగులు కాగా ప్రస్తుతం 1625అడుగులకు చేరిందని జలాశయపు అధికారులు తెలిపారు. జలాశయాన్ని చూడటానికి ప్రవాసీల పోటు పెరిగింది. శనివారం ఆదివారం సెలవురోజులు కావడంతో ప్రవాసీల రద్ది ఎక్కువ అయ్యింది. 


Updated Date - 2021-07-25T18:21:31+05:30 IST