తుంగభద్ర పరవళ్లు

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం రాత్రి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని నది, కాలువలకు వదిలామని బోర్డు కార్యదర్శి నాగమోహన తెలిపారు.

తుంగభద్ర పరవళ్లు
జలాశయం క్రస్ట్‌ గేట్ల నుంచి బయటకు వెళుతున్న నీరు

రాయదుర్గం, ఆగస్టు 10: తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం రాత్రి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని నది, కాలువలకు వదిలామని బోర్డు కార్యదర్శి నాగమోహన తెలిపారు. జలాశయం నీటిమట్టం 1633 అడుగులకుగాను 1631.54 అడుగుల వరకూ నీరు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.1 టీఎంసీలుకాగా, 99.976 టీఎంసీలను నిల్వ చేశారు. ఎగువ నుంచి 1,92,178 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోంది. దీంతో 28 క్రస్ట్‌ గేట్లను నాలుగు అడుగులు, ఐదు గేట్లను ఒక అడుగు ఎత్తి, 1,70,351 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. కాలువలకు 10,618 క్యూసెక్కులు వదులుతున్నారు. 



Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST