నీతిని, ధర్మాన్ని గెలిపించాలి: తుమ్మల

ABN , First Publish Date - 2022-05-27T20:42:19+05:30 IST

పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే వారికి చెంపపెట్టులా నీతిని, ధర్మాన్ని గెలిపించాలని కార్యకర్తలకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

నీతిని,  ధర్మాన్ని గెలిపించాలి: తుమ్మల

ఖమ్మం:  పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే వారికి చెంపపెట్టులా నీతిని, ధర్మాన్ని గెలిపించాలని కార్యకర్తలకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ముత్తగూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలేరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే పెద్ద పాలేరులా పనిచేస్తానని చెప్పానని అన్నారు. 70 ఏళ్లుగా లేని అభివృద్ధిని మూడేళ్లలో సాధించి పాలేరు తలరాత మార్చానని తెలిపారు. పదిమందికి సాయం చేసేలా పాలేరుని అభివృద్ధి చేశామన్నారు.భక్త రామదాసు ప్రాజెక్టుతో భూముల రేట్లు పెరిగాయని చెప్పారు.గతంలో 5 లక్షలు లేని ఎకరం భూమి ఈరోజు 40 లక్షలకు పైగా ఉందన్నారు.సాగునీరు రహదారులతో పాలేరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.పాలేరు అభివృద్ధిని ఓర్వలేని కొన్ని శక్తులు ఎన్నికల్లో వెన్నుపొటు పొడిచాయని మండిపడ్డారు. పాలేరు ప్రజల ప్రేమాభిమానాలతో మళ్లీ ఇక్కడే ప్రజాసేవకు అంకితం అవుతానని తుమ్మల నాగేశ్వరరావు  పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T20:42:19+05:30 IST