ఇది రైతు నిరాశా పథకం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-14T08:50:52+05:30 IST
రైతు భరోసా పథకం, రైతు నిరాశా పథకంగా మారడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు పెట్టు
వేంపల్లె, మే 13: రైతు భరోసా పథకం, రైతు నిరాశా పథకంగా మారడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.7,500 చొప్పున ఐదేళ్లకు రూ.37,500... అది కూడా ఏడాదికి రెండు కంతులుగా ఇస్తానంటున్నారని విమర్శించారు.