TTDP అధ్యక్షుడిగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే?
ABN , First Publish Date - 2021-07-17T20:00:38+05:30 IST
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి రేసులో సరికొత్త పేరు తెరమీదకు వచ్చింది. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి రేసులో సరికొత్త పేరు తెరమీదకు వచ్చింది. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. నేటి సాయంత్రం లేదా సోమవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. అయితే మొదటి నుంచి జాబితాలో ముందున్న సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని, వ్యక్తిగత కారణాలతో పదవి స్వీకరించడానికి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బక్కని నరసింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.