ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది: బక్కనీ నర్సింహులు
ABN , First Publish Date - 2021-11-20T22:02:34+05:30 IST
ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని టీటీడీపీ చీఫ్ బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఘటనను టీటీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ చీఫ్ బక్కనీ నర్సింహులు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ శాసనసభలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదని హితవుపలికారు. చంద్రబాబు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారని తెలిపారు. ఇంటికి పరిమితమైన ఒక ఇళ్లాలుపై వ్యక్తిగత వ్యాఖ్యలు.. సరికాదని పేర్కొన్నారు. జగన్కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదను జగన్ దోచేస్తున్నారని బక్కనీ నర్సింహులు ఆరోపించారు.