రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు

ABN , First Publish Date - 2022-04-14T02:45:30+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి మూడురోజుల పాటు సాలకట్ల వసంత్సోవాలు జరగనున్నాయి.

రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి మూడురోజుల పాటు సాలకట్ల వసంత్సోవాలు జరగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. తర్వాత వసంతమండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజైన శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతారు. తర్వాత  వసంతోత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజైన శనివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి,అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

Updated Date - 2022-04-14T02:45:30+05:30 IST