టీటీడీ అటవీ శాఖ కార్మికులకు టైంస్కేలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-05-25T06:17:41+05:30 IST
టైం స్కేల్ కోసం పోరాడుతున్న టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలంటూ పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా
పలమనేరు, మే 24: టైం స్కేల్ కోసం పోరాడుతున్న టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలంటూ పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు గిరిధరగుప్తా మాట్లాడుతూ... 557 రోజులుగా టైంస్కేలు కోసం 362 మంది పోరాడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019లో అటవీ కార్మికులకు ఎంటీఎస్ టైం స్కేలును అమలు చేసేందుకు బోర్డు తీర్మానించిందని, అయితే నేటివరకు అమలుచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు భువనేశ్వరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్రాజు, అంజిశ్రీ, రామయ్య, రాజాలక్ష్మయ్య, హమాలీ యూనియన్ నాయ కులు జయశంకర, ప్రతాప్, గోపాల్, జయంతి, గీత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.