టీటీడీ అటవీ శాఖ కార్మికులకు టైంస్కేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-25T06:17:41+05:30 IST

టైం స్కేల్‌ కోసం పోరాడుతున్న టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలంటూ పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

టీటీడీ అటవీ శాఖ కార్మికులకు టైంస్కేలు ఇవ్వాలి
ఆర్డీవో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా



ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా 


పలమనేరు, మే 24: టైం స్కేల్‌ కోసం పోరాడుతున్న టీటీడీ అటవీ శాఖ కార్మికులకు న్యాయం చేయాలంటూ పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ముందు  సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు గిరిధరగుప్తా మాట్లాడుతూ... 557 రోజులుగా టైంస్కేలు కోసం 362 మంది పోరాడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019లో అటవీ కార్మికులకు ఎంటీఎస్‌ టైం స్కేలును అమలు చేసేందుకు బోర్డు తీర్మానించిందని, అయితే నేటివరకు అమలుచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు భువనేశ్వరి,  రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్రాజు, అంజిశ్రీ, రామయ్య, రాజాలక్ష్మయ్య, హమాలీ యూనియన్‌ నాయ కులు జయశంకర, ప్రతాప్‌, గోపాల్‌, జయంతి, గీత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:17:41+05:30 IST