అయోధ్యలో టీటీడీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలి

ABN , First Publish Date - 2020-08-10T10:03:07+05:30 IST

ఏపీ భక్తుల కోసం అయోధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్యర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, అతిథిగృహం, కల్యాణమండపం నిర్మించేలా చర్యలు

అయోధ్యలో టీటీడీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలి

  • కల్యాణ మండపం.. వేంకటేశ్వర ఆలయం కూడా..
  • సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ


అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఏపీ భక్తుల కోసం అయోధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్యర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, అతిథిగృహం, కల్యాణమండపం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్రానికి చెందిన వేలాదిమంది రామభక్తులు అయోధ్యను సందర్శిస్తారని, వారి సౌకర్యార్థం టీటీడీ 100 గదులతో వసతి గృహాలను అయోధ్యలో నిర్మించాలని ఆ లేఖలో కోరారు. వేంకటేశ్వరస్వామి ఆలయం, కల్యాణ మండపం, వసతిగృహాల నిర్మాణానికి మూడెకరాల భూమిని కేటాయించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరాలని జగన్‌కు సూచించారు.

Updated Date - 2020-08-10T10:03:07+05:30 IST