‘టీటీడీ నకిలీ వెబ్‌సైట్‌’పై దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2020-07-11T19:09:39+05:30 IST

టీటీడీ నకిలీ వెబ్‌సైట్‌ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్లు..

‘టీటీడీ నకిలీ వెబ్‌సైట్‌’పై దర్యాప్తు వేగవంతం

తిరుచానూరు(చిత్తూరు): టీటీడీ నకిలీ వెబ్‌సైట్‌ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్లు తిరుచానూరు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. తిరుచానూరు-రేణిగుంట రోడ్డుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి రఘు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశాడు. అతడికి టీటీడీ దర్శన్స్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ కనిపించింది. అదే ఒరిజినల్‌గా భావించి టికెట్లు బుక్‌చేసి మోసపోయాడు. ఈ విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ మోసంపై తిరుచానూరు పోలీసులకు టీటీడీ ఏవీఎస్వో పద్మనాభం ఫిర్యాదు చేశారు. దాంతో నకిలీ వెబ్‌సైట్‌ నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్‌ 420తోపాటు సెక్షన్‌ 66 (ఐటీ యాక్ట్‌) ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-11T19:09:39+05:30 IST