TTD ఈవో జవహర్రెడ్డి బదిలీ.. సమావేశంలో CM Jagan ఏమన్నారు..!?
ABN , First Publish Date - 2021-11-18T13:58:17+05:30 IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి జగన్...
తిరుపతి : టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యుటేషన్పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ జవహర్రెడ్డికే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి హోదాలో ఆయన కార్యక్షేత్రం తిరుపతి నుంచి అమరావతికి మారనుంది. అక్కడి నుంచే ఈవో విధులనూ నిర్వర్తించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి జగన్ టీటీడీ అధికారులతో జరిపిన సమీక్ష సందర్భంగా.. త్వరలోనే జవహర్రెడ్డి అమరావతికి వచ్చేస్తారని సీఎం వ్యాఖ్యానించినట్టు దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి.