టీటీడీలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-05T08:36:19+05:30 IST

టీటీడీ అర్చకులు, సిబ్బంది 17మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వారందరినీ క్వారంటైన్‌కు పంపి

టీటీడీలో కరోనా కలకలం

  • అర్చకులు, సిబ్బంది 
  • 17మందికి పాజిటివ్‌ నిర్ధారణ 


తిరుమల, జూలై 4(ఆంధ్రజ్యోతి): టీటీడీ అర్చకులు, సిబ్బంది 17మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వారందరినీ క్వారంటైన్‌కు పంపి అత్యుత్తమ వైద్యసేవలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీరికి విధి నిర్వహణలో కాక, వారి నివాస ప్రాంతాల్లోని పరిస్థితులు, కుటుంబ సభ్యుల ప్రయాణాల కారణంగానే వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయిందన్నారు. శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. కొందరు సభ్యులు నేరుగా పాల్గొనగా, దూరప్రాంతాలకు చెందిన వారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులెవ్వరికీ కరోనా సోకలేదన్నారు. 

Updated Date - 2020-07-05T08:36:19+05:30 IST