శ్రీవారి ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోన్న టీటీడీ

ABN , First Publish Date - 2020-05-23T20:06:19+05:30 IST

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది.

శ్రీవారి ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోన్న టీటీడీ

తిరుపతి: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. టీమ్‌ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరర్ధకమని టీటీడీ అనడం దారుణమని టీడీపీ నేత ఓవీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతల మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. జరుగుతున్న దారుణాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకువెళతామని జనసేన నేతలు తెలిపారు.  

Updated Date - 2020-05-23T20:06:19+05:30 IST