టీటీడీ ఆస్తులపై వైవీ.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-29T02:09:12+05:30 IST

టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ...

టీటీడీ ఆస్తులపై వైవీ.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం

తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ భూములలో వివిధ దశల్లో విక్రయించినవి...ఆక్రమణకు గురైనవి.. అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేత పత్రంలో ఉండాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. టీటీడీకి దాతలు ఇచ్చిన భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. లేకపోతే కోర్టులో కేసులు వేయాలని అధికారులను వైవీ.సుబ్బారెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2020-05-29T02:09:12+05:30 IST