టీటీడీ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-29T04:38:28+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొమ్మేర వెంకట్‌ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి ఉత్తర్వులు వెలువరించాయి. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లికి చెందిన వెంకట్‌రెడ్డి రెండు సంవత్సరాలుగా సలహా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

టీటీడీ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

కొండపాక, జనవరి 28: తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొమ్మేర వెంకట్‌ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి ఉత్తర్వులు వెలువరించాయి. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లికి  చెందిన వెంకట్‌రెడ్డి రెండు సంవత్సరాలుగా సలహా కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి సేవ చేసుకునే అవకాశం కలగడం సంతోషకరమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన  ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు  చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చేపట్టే కార్యక్రమాలు  ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాని పేర్కొన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో వేలమంది నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందించామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశామని గుర్తిచేశారు. 

Updated Date - 2022-01-29T04:38:28+05:30 IST