Telangana ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ చార్జీలు పెరిగిపోయాయ్..!
ABN , First Publish Date - 2022-05-21T14:24:51+05:30 IST
Telangana ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ చార్జీలు పెరిగిపోయాయ్..!
- ట్రావెల్ 24 టికెట్ చార్జీల పెంపు
- రూ.100 నుంచి రూ. 120
హైదరాబాద్ సిటీ : ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) ట్రావెల్ 24 టికెట్ చార్జీలు (Ticket Charges) పెరిగాయి. సేఫ్టీ, డీజిల్ సెస్ల వల్ల సాధారణ టికెట్ల ధరలు రూ.5 నుంచి రూ. 10 వరకు పెరిగాయి. దీంతో ట్రావెల్ 24 టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.120కి పెంచుతూ ఆర్టీసీ అధికారులు ఉత్వర్వులు జారీచేశారు. ట్రావెల్ 24 టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు నగర ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు.