హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి భద్రత పెంపు

ABN , First Publish Date - 2022-01-19T03:43:14+05:30 IST

బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు వార్తల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అబిడ్స్ ఏసీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ఇక నుంచి ..

హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి భద్రత పెంపు

హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు వార్తల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అబిడ్స్ ఏసీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ఇక నుంచి నిరంతరం పార్టీ కార్యాలయం వద్ద సీఐ స్థాయి అధికారి భద్రత పర్యవేక్షించనున్నారు. బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ఏలాంటి వాహనాలు నిలుపరాదని ఆదేశాలు జారీ చేశారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అలెర్ట్ చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి సూచించారు. జనవరి 26వ తేదీ వరకు అలర్ట్‌గా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేయాలని, నిరంతరం అలర్ట్ గా ఉండాలని పార్టీ కార్యాలయం భద్రతను పర్యవేక్షించే టీఎస్ఎస్పీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-19T03:43:14+05:30 IST