ఆర్టీసీకి కొవిడ్‌ దెబ్బ!

ABN , First Publish Date - 2022-01-20T08:17:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా ప్రభావం ఆర్టీసీపై పడిం ది. పండుగ వేళ కళకళలాడిన బస్సులు కాస్తా.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. ..

ఆర్టీసీకి కొవిడ్‌ దెబ్బ!

  ప్రయాణికులు లేక బస్సుల రద్దు.. 

  భారీగా తగ్గిపోతున్న ఆదాయం

హైదరాబాద్‌, జనవరి19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ప్రభావం ఆర్టీసీపై పడిం ది. పండుగ వేళ కళకళలాడిన బస్సులు కాస్తా.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ.. బుధవారం నుంచి సాధారణ షెడ్యూల్‌లోని బస్సుల్లో కూడా 20 నుంచి 25 శాతం మేర తగ్గించి నడుపుతోంది. తెలంగాణ జిలాల్లోని వివిధ ప్రాంతాలకు రోజూ సుమారు 6,200 బస్సులు తిరుగుతుండగా.. బుధవారం నుంచి వీటిని 5వేలకు పరిమితం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 2,800 సిటీ బస్సులు తిరుగుతుండగా.. 500 నుంచి 600 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పండుగలకు ఊర్లకెళ్లిన వారు అధిక శాతం సోమవారానికే హైదరాబాద్‌కు వచ్చేయడంతో  ఆరోజు ఆర్టీసీకి రూ.12.21 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచే ఆదాయం గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌ సిటీలో సాధారణంగా రోజుకు సుమారు రూ. 3 కోట్లు ఆదాయం వస్తుండగా.. నాలుగైదు రోజుల నుంచి ఆదాయం రెండు కోట్లు కూడా మించడం లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల కు కూడా డిమాండ్‌ లేక పోవడంతో.. రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-20T08:17:52+05:30 IST