నల్లగొండ పోలీసులపై కేసు పెట్టాలి

ABN , First Publish Date - 2021-10-20T09:00:49+05:30 IST

నల్లగొండ పోలీసులపై కేసు పెట్టాలి

నల్లగొండ పోలీసులపై కేసు పెట్టాలి

టీడీపీ, బీజేపీ, ఆదివాసీ జేఏసీ డిమాండ్‌

పార్టీల ఆధ్వర్యంలో గిరిజనుల భారీ ర్యాలీ

అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయింపు


చింతపల్లి, అక్టోబరు 19: నల్లగొండ పోలీసులపై హత్యాయత్నం, కిడ్నాప్‌, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని టీడీపీ, బీజేపీ, ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామ గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పోలీసు కాల్పుల్లో గాయపడినవారి కుటుంబ సభ్యులతో కలిసి గాలిపాడు నుంచి అన్నవరం వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. నల్లగొండ పోలీసులపై కేసు నమోదు చేయాలని స్టేషన్‌ ఎస్‌ఐ ప్రశాంతకుమార్‌కు ఫిర్యాదు చేశారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. పోలీసు కాల్పుల్లో గాయపడిన గిరిజన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కిల్లో పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T09:00:49+05:30 IST