చెరువు ఆక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-26T20:08:52+05:30 IST
కలెక్టరేట్ దగ్గర చెరువు ఆక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఎన్జీటీ తిరస్కరించింది.
సూర్యాపేట: కలెక్టరేట్ దగ్గర చెరువు ఆక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ఎన్జీటీ తిరస్కరించింది. నివేదికను చెత్తబుట్టలో వేస్తామని ఎన్జీటీ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. నివేదికలో చెరువు ఆక్రమణపై సరైన సమాచారం లేదని ఎన్జీటీ పేర్కొంది. చెరువు ఆక్రమణపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ విషయం నివేదికలో ప్రస్తావించకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది.